ఢాకా: సీనియర్ ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్ (213 బంతుల్లో 114 బ్యాటింగ్; 14 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ శతకంతో చెలరేగడంతో బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక భారీ స్కోరు దిశగా సాగుతున్నది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన లంక తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లను మాథ్యూస్ సమర్థంగా ఎదుర్కోగా.. కుషాల్ మెండిస్ (54), ఒషాడో ఫెర్నాం డో (36) రాణించారు. ప్రస్తుతం మాథ్యూస్తో పాటు దినేశ్ చండిమాల్ (34 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. బంగ్లా బౌలర్లలో నయీమ్ హసన్ రెండు వికెట్లు పడగొట్టాడు.