వేములవాడ టౌన్, అక్టోబర్ 21: సిరిసిల్లకు చెందిన నేతన్న నల్ల విజయ్కుమార్ అగ్గిపెట్టెలో పట్టేలా నేసిన చీర, కండువాను వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి బహూకరించారు. 5 మీటర్ల పొడవు, 43 ఇంచుల వెడల్పుతో తయారు చేసిన చీరను అమ్మవారికి, కండువాను స్వామివారి కోసం ప్రత్యేకంగా నేసి గురువారం ఆలయ ఈవో కృష్ణప్రసాద్కు అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి విజయ్కుమార్కు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.