చెన్నై : తమిళ నటి గౌరీ కిషన్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తనకు కరోనా సోకిందని, మిగత వారందరూ జాగ్రత్తగా ఉండాలని ఇన్స్టా వేదికగా గౌరీ చెప్పింది. తనను ఇటీవల కలిసిన వారంతూ తప్పనిసరిగా కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్లో ఉన్నానని, తన ఆరోగ్య పూర్తిగా నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.
గౌరీ కిషన్ చివరగా తమిళ నటుడు విజయ్ నటించిన మాస్టర్ చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో ఆమె స్టూడెంట్ లీడర్గా యాక్ట్ చేసింది. డైరెక్టర్ సీ ప్రేమ్ కుమార్ చిత్రీకరించిన 96 మూవీలో త్రిష చిన్ననాటి క్యారెక్టర్లో నటించింది గౌరీ. సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన కర్ణన్ చిత్రంలోనూ గౌరీ నటించింది. ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.