హైదరాబాద్ : నగరంలో వరుస అగ్ని ప్రామాదాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా బహదూర్పురా పరిధిలోని కిషన్బాగ్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ సోఫా తయారీ కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు విస్తరించడంతో ఆ ప్రాంతం దట్టమైన పొగతో నిండిపోయింది.గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచరమిచ్చారు.
వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సోఫా తయారీ కేంద్రం చుట్టుపక్కల జనావాసాలు ఉండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటలు పక్కన ఉన్న ఇళ్లకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.