న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల్లో భారత హాకీ జట్టుకు మన్ప్రీత్ సింగ్ సారథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 18 మంది సభ్యులు ఉన్న జట్టును హాకీ ఇండియా ఇవాళ ప్రకటించింది. జూలై 29వ తేదీ నుంచి బర్మింగ్హామ్లో కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి. ఈ గేమ్స్లో ఇండియా పూల్ బీలో ఉంది. దాంట్లో ఇంగ్లండ్, కెనడా, వేల్స్ అండ్ ఘనా దేశాలు ఉన్నాయి. జూలై 31వ తేదీన ఘనాతో భారత్ తొలి మ్యాచ్లో తలపడుతుంది. గత ఏడాది టోక్యో ఒలింపిక్స్లో ఇండియన్ జట్టుకు బ్రాంజ్ మెడల్ అందించిన మన్ప్రీత్ సింగ్ కామన్వెల్త్ క్రీడల్లోనూ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. డ్రాగ్ఫ్లిక్ స్పెషలిస్ట్ హర్మన్ప్రీత్ సింగ్ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు చేపడుతారు.