హైదరాబాద్, ఆట ప్రతినిధి: వరల్డ్ సైక్లింగ్ అలయన్స్ (డబ్ల్యూసీఏ) తొలి ఉపాధ్యక్షుడిగా హైదరాబాద్కు చెందిన డీవీ మనోహర్ ఎంపికయ్యారు. ప్రపంచవ్యాప్తంగా సైక్లింగ్ క్రీడను ప్రోత్సహిస్తున్న డబ్ల్యూసీఏలో మూడేండ్ల పాటు మనోహర్ పదవిలో కొనసాగనున్నారు. నెదర్లాండ్స్కు చెందిన హెంక్ స్వార్టోవ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. హైదరాబాద్ బైస్క్లింగ్ క్లబ్ ప్రస్తుత చైర్మన్గా వ్యవహరిస్తున్న మనోహర్..గతంలో సీఐఐ(ఆంధ్రప్రదేశ్) చైర్మన్గానూ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రతిష్ఠాత్మక పదవుల్లోనే కాదు సైక్లింగ్లో మనోహర్ పలు రికార్డులు నెలకొల్పారు. తన కొడుకు, కుమార్తెతో కలిసి లండన్ నుంచి ప్యారిస్ వరకు 516కిలోమీటర్ల దూరాన్ని సైకిల్పై తక్కువ వ్యవధిలో పూర్తి చేశారు. 16వేల మంది సభ్యులతో దేశంలో ప్రముఖ సైక్లింగ్ క్లబ్లలో ఒకటిగా కొనసాగుతున్న హైదరాబాద్ సైక్లింగ్ క్లబ్ ఆయన నేతృత్వంలో ముందుకు సాగుతున్నది.