న్యూఢిల్లీ, అక్టోబర్ 28: అంతర్జాతీయంగా పుత్తడికి డిమాండ్ తగ్గుతున్నా, ఇండియాలో మాత్రం భారీగా పెరుగుతోంది. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారత్లో బంగారం డిమాండ్ 47 శాతం వృద్ధితో 139.1 టన్నులకు చేరినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గురువారం విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. గతేడాది ఇదేకాలంలో డిమాండ్ 94.6 కోట్ల టన్నులుగా ఉంది. విలువ రీత్యా సెప్టెంబర్ త్రైమాసికంలో పుత్తడి డిమాండ్ 37 శాతం వృద్ధితో రూ. 43,160 కోట్ల నుంచి రూ. 59,330 కోట్లకు పెరిగినట్లు కౌన్సిల్ తెలిపింది. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో పాటు బంగారం ధర తగ్గడం అధిక కొనుగోళ్లకు కలసివచ్చిందని డబ్ల్యూజీసీ ఇండియా సీఈవో సోమసుందరం చెప్పారు. వివరాలు…
గతేడాదికంటే ఈ జూలై-సెప్టెంబర్లో జ్యువెల్లరీ డిమాండ్ 58 శాతం వృద్ధితో 60.8 టన్నుల నుంచి 96.2 టన్నులకు చేరిక. విలువ ప్రకారం 48 శాతం ఎగసి రూ. 27,750 కోట్ల నుంచి రూ.41,030 కోట్లకు పెరుగుదల.
ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ 33.8 టన్నుల నుంచి రూ. 42.9 టన్నులకు వృద్ధి. విలువలో ఇది రూ.18,300 కోట్లుగా నిలిచింది.