రంగులు చల్లుకుంటూ హోరెత్తించిన యువత
కేరింతలతో చిన్నారుల తుళ్లింత
ఆంక్షల నేపథ్యంలో పరిమితంగా వేడుకలు
మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో రంగు ల కేళీ.. హోలీ పండుగను ఆదివారం ప్రజలు నిర్వహిం చుకున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రంగులను పూసుకొని హోలీ శుభాకాంక్షలు తెలియజే సుకున్నారు. పిల్లలు, యువత, మహిళలు కేరింతలతో నృత్యాలు చేశారు. ఆదివాసీ గ్రామాల్లో కామదహనం చేసి, వేడుకలు నిర్వహించారు. గ్రామపటేళ్లకు కుడుక లు, చక్కెర బిళ్లల హారాలను సమర్పించారు. గిరిజన సంప్రదాయ నృత్యాలు చేశారు. కరోనా తీవ్రత నేప థ్యంలో ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో ఈ ఏడాది అంతంతమాత్రంగానే వేడుకలు నిర్వహించారు.