హైదరాబాద్: నగరంలోని చందానగర్లో (Chandanagar) యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుడివద్ద మద్యం తాగొద్దని చెప్పినందుకు అంజి అనే యువకుడిని నరేష్ బీరుసీసాతో పొడిచి చంపాడు. చందానగర్ పాపిరెడ్డి కాలనీలో రాధాకృష్ణ గుడి వద్ద నగేశ్ అనే వ్యక్తి మద్యం సేవిస్తున్నాడు. గమనించిన ఆంజనేయులు అలియాస్ అంజి అనే యువకుడు.. ఇక్కడ మందు తాగొద్దని మందలించాడు. దీంతో మద్యం మత్తులో ఉన్న నగేశ్.. బీరు సీసాతో అంజి గొంతుకోశాడు.
దీంతో తీవ్రంగా గాయపడిన అంజి మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.