కౌలాలంపూర్ : మలేషియాలోని రెస్టారెంట్లో ఓ వ్యక్తి ఫ్రైడ్ చికెన్ ఆర్డర్ చేస్తే అందులో పురుగులు బయటపడటం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో (viral video)ను మలేషియా మోస్ట్ వైరల్ అనే పేజ్ ట్విట్టర్లో షేర్ చేసింది. ఈ వీడియోను ఇప్పటివరకూ ఏకంగా మూడు లక్షల మందికి పైగా వీక్షించారు.
Jijik… Banyak pulak ulat kat ayam tu… Redha je lah kalau dh termasuk dalam perut… pic.twitter.com/AvwjWsHcYF
— MALAYSIA MOST VIRAL (@MALAYSIAVIRALLL) April 18, 2023
మలేషియన్ రెస్టారెంట్లో సర్వ్ చేసిన చికెన్లో కస్టమర్కు పురుగులు కనిపించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ షార్ట్ క్లిప్లో సగం తిన్న ఫ్రైడ్ చికెన్లో బయటపడ్డ పురుగులను చూపేందుకు కస్టమర్ మలేషియన్ రెస్టారెంట్ వెయిటర్ను పిలుస్తుండటం కనిపిస్తుంది.
ఓ మై గాడ్! చికెన్లో చాలా పురుగులున్నాయ్ అని పోస్ట్కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ క్లిప్ను చూసిన తర్వాత నెటిజన్లు సదరు మలేషియన్ రెస్టారెంట్ తీరుపై మండిపడ్డారు. అందుకే తాను రెస్టారెంట్స్లో అరుదుగా తింటానని ఓ యూజర్ కామెంట్ చేయగా, జుగుప్ప కలిగించేలా ఉందని మరో యూజర కామెంట్ చేశారు.
Read More