కరోనా తీవ్రత తగ్గిపోయి ఉండవచ్చు. కానీ భయం మాత్రం పోలేదు. నిజానికి ఆ మాత్రం జంకు ఉండాల్సిందే! మరికొంత కాలం మాస్కు తప్పదని అర్థమైపోతున్నది. వాడినన్ని రోజులూ నాణ్యమైనవి ధరిస్తేనే సురక్షితం. దీంతో మాస్కుకు సాంకేతికతను జోడిస్తున్నారు తయారీదారులు. తాజాగా ఫిలిప్స్ కంపెనీ నాలుగు లేయర్ల డబుల్ ఫిల్టర్ మాస్క్ను విడుదలచేసింది. ఇది బయటినుంచి లోపలికి, లోపలినుంచి బయటికి వెళ్లే గాలిని వడబోస్తుంది. స్వచ్ఛమైన ప్రాణవాయువును లోనికి పంపేందుకు ఓ బుజ్జి ఫ్యాన్ కూడా జోడించారు. ఫ్యాషనబుల్గానూ ఉంది. ధర ఏడువేల రూపాయలు.