జైరాజ్, ప్రవీణ్, సిమ్రాన్, హన్సిక శ్రీనివాస్ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘మల్లెతీగ’. పల్లి మోహన్రావు దర్శకుడు. శ్రీను మోచర్ల నిర్మాత. బుధవారం హైదరాబాద్లో ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు సముద్ర క్లాప్నిచ్చారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథా చిత్రమిది. రివెంజ్ డ్రామాగా రూపొందిస్తున్నాం. సింగిల్ షెడ్యూల్లో ఈసినిమాను పూర్తిచేస్తాం’ అన్నారు. వైజాగ్ సమీపంలోని ఓ గిరిజన గ్రామంలో షూటింగ్ జరిపేందుకు ప్లాన్చేస్తున్నామని నిర్మాత తెలిపారు. యూత్ను మెప్పించే అన్ని హంగులున్న సినిమా ఇదని నాయకానాయికలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: నగేష్ గౌరీస్, ఛాయాగ్రహణం: దేవేంద్రసూరి పరవస్తు.