చేవెళ్ల టౌన్, డిసెంబర్ 12: పల్లెలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సంకల్పించిన రాష్ట్ర సర్కార్ పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నది. ఒకప్పుడు అస్తవ్యస్తంగా ఉన్న చేవెళ్ల మండలంలోని మల్లారెడ్డిగూడ గ్రామం ప్రస్తుతం పల్లెప్రగతి కార్యక్రమంతో అభివృద్ధిపథంలో దూసుకెళ్తూ చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. ఈ ఊరిలో 656 మంది జనాభా ఉన్నది. సర్పంచ్, పాలకవర్గ సభ్యులు ప్రతినెలా వచ్చే ప్రభు త్వ నిధులతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం పంచాయతీ సిబ్బంది వీధులను శుభ్రం చేస్తుండటంతో పల్లె శుభ్రంగా మారింది. పారిశుధ్య కార్మికులు సేకరించిన చెత్తాచెదారాన్ని పంచాయతీ ట్రాక్టర్ ద్వారా డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. సేకరించిన చెత్తతో సేంద్రియ ఎరువును తయారు చేస్తూ హరితహారం మొక్కలకు వినియోగిస్తున్నారు. అన్ని వీధుల్లో సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలను నిర్మించారు. స్థానికులు ఇంటింటికీ మరుగుదొడ్లను నిర్మించుకోవడంతో స్వచ్ఛ గ్రామంగా మా రింది. మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ కుళాయిలను ఏర్పాటు చేసి తాగునీటిని సరఫరా చేస్తుండటంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అదేవిధంగా వైకుంఠధామం నిర్మాణం పూర్తై అం దుబాటులోకి వచ్చింది. గ్రామ రోడ్డుకు ఇరువైపులా హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి పచ్చని తోరణాల్లా దర్శనమిస్తున్నాయి. హరితహారం లో భాగంగా పల్లెలోని ఖాళీ ప్రదేశాలతోపాటు ఇం టింటికీ మొక్కలను అందజేశారు. నాటిన మొక్కలకు ట్రీ గార్డులను ఏర్పాటు చేసి, నిత్యం పంచాయతీ ట్రాక్టర్తో నీళ్లు అందిస్తుండటంతో అవి పచ్చగా కళకళలాడుతున్నాయి. వివిధ రకాల మొక్కలతో నిర్మించిన పల్లె ప్రకృతివనం గ్రామానికి కొత్తందాన్ని తీసుకొచ్చిది. పల్లె ప్రకృతివనంలో అల్లనేరేడు, నీలగిరి, కొబ్బరి తదితర మొక్కలతోపాటు పూల మొక్కలను నాటడంతో అవి ఏపుగా పెరిగి ఆహ్లాదకర వాతావరణం నెలకొన్నది. గ్రామస్తులు సకాలంలో పన్నులు చెల్లిస్తుండటంతో వచ్చే నిధులను గ్రామ అభివృద్ధి పనులకు వినియోగి స్తున్నారు. గ్రామాభివృద్ధికి అధికారులు, ప్రజా ప్రతినిధులు సమష్టిగా కృషి చేస్తున్నారు.
గ్రామాభివృద్ధికి కృషి
పంచాయతీ వార్డు సభ్యులు, ప్రజాప్రతిని ధులు, గ్రామస్తుల సహకారంతో గ్రామా న్ని మరింత అభివృద్ధి చేస్తా. ఇప్పటికే అన్ని వీధుల్లో సీసీరోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీల ను నిర్మించా. వైకుంఠధామం, డంపింగ్యార్డులు అందుబాటులోకి వచ్చాయి. వివిధ రకాల మొక్కలతో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృ తివనం ఆకట్టుకుంటున్నది.
స్వచ్ఛ గ్రామంగా మల్లారెడ్డిగూడ..
వీధులను పంచాయతీ సిబ్బంది నిత్యం శుభ్రం చేస్తుండటంతో స్వచ్ఛ గ్రామంగా మారింది. ప్రతిరోజూ పంచాయతీ ట్రాక్టర్తో ఇంటింటికె ళ్లి చెత్తను సేకరించి డం పింగ్యార్డుకు తరలిస్తున్నాం. మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్నాం. పంచాయతీ ట్యాంకర్తో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు ప్రతిరోజూ నీటి ని అందిస్తున్నాం.