చేర్యాల, ఫిబ్రవరి 21 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 6వ ఆదివారం సందర్భంగా రూ. 24,71,845 ఆదాయం వచ్చినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.
శని ఆదివారాలలో ఆర్జిత సేవలు, గదులు, దర్శనాలు, ప్రసాదాల విక్రయం తదితర వాటి ద్వారా శనివారం రూ. 2,32,066, ఆదివారం రూ. 22,39,779 వచ్చినట్లు తెలిపారు. రెండు రోజులకు మొత్తం ఆదాయం రూ.24,71.845 స్వామి వారి ఖజానాకు సమకూరినట్లు తెలిపారు.
ఉత్సవాల సందర్భంగా ప్రతి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో స్వామి వారి ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.