మల్కాజిగిరి, జనవరి 8: మల్కాజిగిరి నియోజకవర్గం అభివృద్ధే ధ్యేయం అని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం మచ్చబొల్లారం డివిజన్, సామల లక్ష్మి కాలనీలో రూ.47లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణ ప నులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి పనులకు నిధుల కొరతలే దని అన్నారు. ఇప్పటికే కానాజీగూడ నుంచి వెంకటాపురం, లోతుకుంట నుంచి వెస్ట్ వెంకటాపురం వరకు దాదాపు 1.5కోట్లతో వైట్ టాపింగ్ రోడ్ల పనులు పూర్తి చేశామని అన్నారు.
మిలట్రీ ఏరియా నుంచి వచ్చే వరద ముంపురా కుండా రూ.40లక్షలతో వరద కాలువ నిర్మాణ పనులు పూర్తి చేశామన్నారు. శ్రీబేకరి వద్ద తరచూ వచ్చే వరద నీటి పారుదల కోసం బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. అధికారులతో కాలనీలను సర్వే చేయించి అవసరమైన కాలనీల్లో సీసీ రోడ్ల పనులు చేపడుతామని అన్నారు.
నిర్మాణ పనుల్లో నాణ్యతాలోపాలు జరుగకుండా పనులను అధికారులు నిరంతరం పరిశీలిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్, ఈఈ రాజు, డీఈ మహేశ్, వాటర్ వర్క్స్ మేనేజర్ మల్లికార్జున్, సురేందర్రెడ్డి, మల్లేశ్, మల్లికార్జున్, లక్ష్మణ్యాదవ్, వెంక టేశ్యాదవ్, రాజేశ్, బాబన్న, రమేశ్యాదవ్, రాజు యా దవ్, జస్వంత్యాదవ్, సతీశ్, నిరంజన్, సంజీవ్, సన్దీప్, కవిత, రాణి తదితరులు పాల్గొన్నారు.