SSMB28 Movie Shooting Begins | టాలీవుడ్లో కొన్ని కాంబోలుంటాయి. ఆ కాంబోలో సినిమా వస్తుందంటే ప్రేక్షకులే కాదు సినీ సెలబ్రెటీలు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. అలాంటి కాంబోలలో మహేష్- తివిక్రమ్ కాంబో ఒకటి. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందంటే అది పక్కా కల్ట్ క్లాసిక్ అని ప్రేక్షకులు భావిస్తంటారు. గతంలో వీళ్ళ కాంబోలో తెరకెక్కిన ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలు కమర్షియల్గా అంతగా సక్సెస్ సాధించకోపోయినా బుల్లితెరపై మాత్రం ఘన విజయం సాధించాయి. ఈ రెండు చిత్రాలు టీవీలో వచ్చిన ప్రతిసారి మంచి టీఆర్పీను సొంతం చేసుకుంటాయి. దాదాపు 12ఏళ్ళ తర్వాత వీళ్ళ కాంబోలో మూడో చిత్రం తెరకెక్కుతుంది. ఈ ఏడాది ప్రారంభంలోనే పూజా కార్యక్రమాలు జరుపకున్న ఈ చిత్రం సోమవారం షూటింగ్ మొదలు పెట్టింది.
రామోజీఫిలిం సిటీలో ‘SSMB28’ షూటింగ్ ప్రారంభమైంది. ఈ ఎపిసోడ్లో భారీ యాక్షన్ సన్నీవేశాలను తెరకెక్కించనున్నారట. తాజాగా ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ సినిమా షూటింగ్ను ప్రారంభించినట్లు ట్వీట్ చేశాడు.. ఈ చిత్రంలో మహేష్కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.చినబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 28న తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల కాబోతుంది.
The filming of an Epic Action Entertainer Begins today!🔥
The blockbuster combo of Superstar @urstrulymahesh & #Trivikram garu on sets after 12 years!! ✨⭐️
SUPERSTAR in a massy rugged avatar 🤩🤩
Await for more surprises coming your way, SOON!! #SSMB28Aarambham #SSMB28 pic.twitter.com/uu1J8L0xd3
— Naga Vamsi (@vamsi84) September 12, 2022