మక్తల్ రూరల్, అక్టోబర్ 28 : రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు చేయూతనిస్తున్నదని, దీంతో రాష్ట్రంలో నీలి విప్ల వం కొనసాగుతున్నదని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని గడ్డంపల్లి గ్రామ సమీపంలో జూరాల బ్యాక్ వాటర్లో 12.69 లక్షల రొయ్య పిల్లలను ఎమ్మెల్యే విడుదల చేశారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. ము ఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో ప్రోత్సాహకాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. మత్స్య స హకార సంఘాలను మరింత బలోపే తం చేయడానికి కృషి చేస్తామన్నారు. కృ ష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉచితం గా చేపల పిల్లలు పంపిణీ చేశామని చె ప్పారు. నర్సిరెడ్డి, భూత్పూర్ బ్యాలెన్సిం గ్ రిజర్వాయర్లలో 20 లక్షల చేపపిల్లలు, 10 లక్షల రొయ్య పిల్లలను విడుదల చే శామని తెలిపారు. రొయ్యల పెంపకం కో సం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు పే ర్కొన్నారు. కార్యక్రమంలో గడ్డంపల్లి, ముష్టిపల్లి సర్పంచులు త్రివేణి, విజయలక్ష్మి, జిల్లా మత్స్యశాఖ ఏడీఈ నాగులు, మాజీ ఎంపీపీ గడ్డంపల్లి హన్మంతు, టీఆర్ఎస్ మండల కమిటీ అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, మీడియా కన్వీనర్ నేతాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అన్నివర్గాల అభ్యున్నతే లక్ష్యం..
ఆత్మకూరు, అక్టోబర్ 28 : అన్ని వ ర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సర్కార్ పనిచేస్తున్నదని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆత్మకూరు పరమేశ్వరస్వామి చెరువులో చైర్పర్సన్ గాయత్రీ యాదవ్, నాయకులతో కలిసి ఎమ్మెల్యే చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆత్మకూరు చెరువులో 36 వేల చేపపిల్లలు, రామన్పాడ్ రిజర్వాయర్లో 3.30 లక్షల చేపపిల్లలు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. కుల వృత్తులపై ఆధారపడిన వారిని ఆర్థికంగా అభివృద్ధి పథంలోకి తీసుకరావాలన్నదే సీఎం కేసీఆర్ తపనని అన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కోటేశ్వర్, పీఏసీసీఎస్ అధ్యక్షు డు కృష్ణమూర్తి, లక్ష్మీకాంత్రెడ్డి, రైతుబం ధు సమితి నాయకుడు వీరేశలింగం, టీ ఆర్ఎస్ మండలాధ్యక్షుడు రవికుమార్ యాదవ్, కోఆప్షన్ సభ్యుడు షేక్ మహబూబ్, నాయకులు, వివిధ అనుబంధ కమిటీల పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మత్స్యకార సంఘం ప్రతినిధులు అశ్విన్కుమార్, లక్ష్మీనారాయణ, పోషన్న, రాజు, కృష్ణ, బాలస్వా మి, ధర్మయ్య, పప్పుశ్రీను, వెంకటన్న, ఎఫ్డీవో రహమాన్, సిబ్బంది ప్రమోద్, శ్రీను, సుధాకిరణ్ పాల్గొన్నారు.
జూరాల డ్యాంలో చేప పిల్లలు విడుదల
అమరచింత, అక్టోబర్ 28 : మండలంలోని నందిమల్ల గ్రామ శివారులోని జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో ఎమ్మె ల్యే చిట్టెం 5.60 లక్షల చేపపిల్లలు వ దిలారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ అమరచింత మండలానికి 8 నుంచి 9 లక్షల చేప పిల్లలను తీసుకొచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో మత్స్యశాఖ డిఫ్యూటీ డైరెక్టర్ సుజాత, వైస్ ఎం పీపీ బాల్రెడ్డి, ఆత్మకూరు మార్కెట్ కమి టీ వైస్ చైర్మన్ నాగభూషణంగౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్, నాయకులు రాజు, వెంకటయ్య, రవి, షాన్వాజ్ఖాన్, మత్స్యశాఖ ఫీల్డ్ ఆఫీసర్ భరత్కుమార్, ఫీల్డ్మెన్ కృష్ణయ్య ఉన్నారు.