బాలానగర్, నవంబర్ 10 : రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ఉడిత్యాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు ఏ కష్టం రాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. రైతుల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేయడంతోపాటు ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
రైతులకు ఇబ్బందులు ఏర్పడొద్దు
కోయిలకొండ, నవంబర్ 10 : ధాన్యం కొనుగోలు కేం ద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా చర్య లు తీసుకుంటున్నట్లు జెడ్పీటీసీ విజయభాస్కర్రెడ్డి అన్నా రు. బుధవారం మండలంలోని ఎల్లారెడ్డిపల్లి, అంకిళ్ల గ్రా మాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ వానకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు మండలంలో 15 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభు త్వం మద్దతు ధరకు ధాన్యం కొనగోలు చేస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల కన్వీనర్ మల్లయ్య, సర్పంచులు రజితారవీందర్రెడ్డి, వైస్ఎంపీపీ కృష్ణయ్యయాదవ్, నారాయణరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బీ కృష్ణయ్య, నాయకులు శ్రీనివాస్రెడ్డి, భీంరెడ్డి, రాజవర్ధన్రెడ్డి ఏవో రామకృష్ణ,సీసీ మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు
దేవరకద్ర రూరల్, నవంబర్ 10 : రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని ఎంపీపీ రమాదేవి, పీఏసీసీఎస్ చైర్మన్ నరేందర్రెడ్డి అన్నా రు. బుధవారం మండలంలోని గుడిబండ, గోపన్పల్లి, కౌకుంట్ల గ్రామాల్లో సింగిల్విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వమే గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. రైతులు ధాన్యంలో తేమశాతం, మటిపెల్లలు, తాలు లేకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుజాత, సర్పంచులు కోట్ల రజిత, స్వప్న, పీఏసీసీఎస్ డైరెక్టర్ కృష్ణగోపాల్, ఏఈవోలు శ్రీనివాసులు, శివకృష్ణ, సీఈవో శ్రీనివాసులు, భాస్కర్రెడ్డి, శేఖర్రెడ్డి పాల్గొన్నారు.
నాణ్యత పాటించాలి
భూత్పూర్, నవంబర్ 10 : రైతులు ధాన్యంలో నాణ్యత లోపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మండల వ్యవసాయాధికారి మురళీధర్ అన్నారు. బుధవారం మండలంలోని కప్పెట, వెల్కిచర్ల గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఏ గ్రేడ్కు రూ.1960, బీ గ్రేడ్కు రూ.1940 మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టడంతోపాటు, తాలు లేకుండా చూడాలని తెలిపారు. అలాగే రైతులు ఆధార్కు సెల్ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ సీఈవో రత్నయ్య, ఏఈవో శంకర్ పాల్గొన్నారు.
నవాబ్పేట మండలంలో..
నవాబ్పేట, నవంబర్ 10 : మండలంలోని కూచూర్ గ్రామంలో సింగిల్విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం సింగిల్విండో చైర్మన్ మాడెమోని నర్సింహులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి గ్రామాల్లోనే కొంటున్నదని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మమ్మ, ఎంపీటీసీ విజయశ్రీ, నాయకులు నాగిరెడ్డి, ప్రతాప్, రవి తదితరులు పాల్గొన్నారు.