మరికల్, నవంబర్ 9 : రాష్ట్రంలో కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందు కు అనుగుణంగానే ప్రభుత్వం ప్రతి మండలంలో కేజీబీవీలను ఏర్పాటు చేస్తుందని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అ న్నారు. మంగళవారం మండలంలోని పస్పులలో కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాల నిర్మాణ పనులను ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేజీబీవీ పను లు వేగవంతంగా పూర్తి చేయాలని, నాణ్యతతో నిర్మాణం పనులు చేపట్టాలని పేర్కొన్నారు. కేజీబీవీల్లో జూనియర్ క ళాశాలలు, డిగ్రీ కళాశాలలుగా అప్గ్రేడ్ కావడం జరుగుతున్నదన్నారు. రూ.3 కోట్ల 37 లక్షల వ్యయంతో నిర్మాణం చేస్త్తున్న కేజీబీవీ పనులు వచ్చే విద్యా ఏడాది వరకు పూర్తి చే యాలన్నారు. కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాల నిర్మాణానికి సహకరించిన గ్రామస్తులు, నాయకులను ఎమ్మెల్యే అభినందించారు.
బట్టర్ ఫ్లై దీపాలు ప్రారంభం
మండలకేంద్రంలోని అంతరాష్ట్ర రోడ్డుపై నూతనంగా ఏ ర్పాటు చేసిన బట్టర్ ఫ్లై దీపాలను ఎమ్మెల్యే ప్రారంభించి అభివృద్ధిలో మరికల్ నంబర్ వన్గా నిలుస్తుందన్నారు. కా ర్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ సురేఖారెడ్డి, వైస్ ఎంపీపీ రవికుమార్, సర్పంచులు మహదేవమ్మ, గోవర్ధన్, ఎంపీటీసీలు జయమ్మ, సుజాత, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ సంపత్కుమార్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాజవర్ధన్రెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యుడు మతీన్, డీసీడీ వో పద్మనళిని, కేజీబీవీ ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మి, తాసిల్దార్ శ్రీధర్, ఏఈ విజయభాస్కర్, డీఈ రాములు, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.