న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ ముంబైలో లగ్జరీ అపార్ట్మెంట్ కొనుగోలు చేసింది. ఆ అపార్ట్మెంట్ ఖరీదు సుమారు రూ. 48 కోట్లు ఉన్నట్లు తెలిసింది. ఇండియాబుల్స్ బ్లూ ప్రాజెక్టులో ఆ ప్రాపర్టీ ఉంది. సెప్టెంబర్ 8వ తేదీన ఆ ప్రాపర్టీని రిజిస్టర్ చేశారు. బిల్డింగ్లోని 53వ ఫ్లోర్లో ఉన్న ఆ అపార్ట్మెంట్ సుమారు 5384 చదరపు గజాలు ఉంది. దీని కోసం ఏడు కార్ల పార్కింగ్ స్థలాన్ని ఇచ్చారు. కాలెస్ ల్యాండ్ డెవలప్మెంట్ ఈ అపార్ట్మెంట్ అమ్మింది. మాధురీ దీక్షిత్ ఖరీదు చేసిన అపార్ట్మెంట్ నుంచి అరేబియా సముద్రం అద్భుతంగా కనిపిస్తుందని ఇండియాబుల్స్ బ్లూ తన వెబ్సైట్లో తెలిపింది. ఇండియాబుల్స్ తన ఇన్స్టాగ్రామ్లో ఇంటి ఫోటోలను అప్లోడ్ చేసింది.