ప్రముఖ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇటీవల అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుప్రతిలో చికిత్స తీసుకుంటున్నారు. సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ సోమవారం ఆసుపత్రి వర్గాలు హెల్త్బులెటిన్ విడుదల చేశాయి. ‘సిరివెన్నెల న్యుమోనియాతో బాధపడుతూ ఈ నెల 24న మా ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నాం. నిపుణులైన వైద్య బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నది. సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తాం’ అని హెల్త్బులెటిన్లో పేర్కొన్నారు.