న్యూఢిల్లీ: ‘లక్కీ డ్రా’తో కరోనా వ్యాక్సినేషన్ను వేగవంతం చేయవచ్చని కేంద్రం భావిస్తున్నది. వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్న వారికి వారం లేదా నెలవారీగా లక్కీడ్రా తీసి విజేతలకు నగదు, కిచెన్ పరికరాలు, రేషన్ కిట్, ట్రావెల్ పాస్లు వంటి బహుమతులు ఇవ్వాలన్న యోచనలో కేంద్ర ఆరోగ్యశాఖ ఉంది. పనిప్రదేశాల్లో వ్యాక్సిన్లు వేయడంతో పాటు రెండు డోసులు పూర్తి చేసుకున్న వారికి బ్యాడ్జ్లు ఇచ్చే కార్యక్రమాలు కూడా కేంద్రం ప్రణాళికలో ఉన్నాయి.