‘సెకండ్వేవ్ తర్వాత థియేటర్లో విడుదలైన ‘లవ్స్టోరి’ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారు. కొవిడ్ భయాల మధ్య కూడా మాకు పెద్ద విజయాన్ని అందించి అందరిలో ధైర్యాన్ని నింపారు. థియేటర్లో చూడని వారందరూ ‘ఆహా’ ఓటీటీలో ఈ సినిమాను చూసి ఆనందిస్తారనే నమ్మకముంది’ అని తెలిపారు శేఖర్ కమ్ముల. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్స్టోరి’. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించారు. నారాయణ్దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మించారు. శుక్రవారం ‘ఆహా’ ఓటీటీలో ఈ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ‘పైరసీ వల్ల సినీ పరిశ్రమకు ఎంతో నష్టం కలుగుతుంది. ఎన్నో కష్టాలకోర్చి దర్శకనిర్మాతలు సినిమాలు తీస్తుంటారు. వారి శ్రమ వృథా కాకుడదు’ అని అన్నారు. పైరసీని ప్రోత్సహించకుండా ‘ఆహా’ఓటీటీలోనే ఈ సినిమా చూడాలని ‘ఆహా’ ప్రతినిధి హెచ్వీ చలపతిరాజు పేర్కొన్నారు.