తిమ్మాపూర్ : ఇటీవల కురుస్తున్న వర్షాలకు దిగువ మానేరు (ఎల్ఎండీ) జలాశయంలోకి రిజర్వాయర్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 12 గేట్లను ఎత్తి 64,332 క్యూసెక్కుల నీటిని దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం గత మూడు రోజులుకు కురుస్తున్న భారీ వర్షాలతో మోయతుమ్మెద వాగు నుంచి 40,184 క్యూసెక్కులు, మిడ్ మానేరు నుంచి 24,748 క్యూసెక్కులు, పరీవాహక ప్రాంతం నుంచి 1200 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది.
ఎల్ఎండీలో పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 22.918 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు. రిజర్వాయర్లోకి 66,132 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. 12 గేట్లు ఎత్తి 64,332 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. కాకతీయ కాలువ ద్వారా 1500 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 300 క్యూసెక్కులు ఔట్ ఫ్లో ఉన్నది. ఎగువ నుంచి ఇన్ఫ్లో పెరిగితే మరిన్ని గేట్లు తెరువనున్నట్లు తెలిపారు.