న్యూఢిల్లీ, డిసెంబర్ 1: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త. వారు ఫించను పొందేందుకు ప్రతీ సంవత్సరం బ్యాంకులు/పోస్టాఫీసులకు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సిన గడువు తేదీని 2021 డిసెంబర్ 31 వరకూ పెంచుతున్నట్లు బుధవారం కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. వాస్తవానికి ఈ గడువు నవంబర్ 30తో ముగిసింది. వివిధ రాష్ర్టాల్లో కొవిడ్-19 కేసులు వస్తున్న కారణంగా గడువును పెంచుతున్నామని, ఈ పెంపుకాలంలో యధావిధిగా పెన్షన్ చెల్లింపు జరుగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.