ముంబై, జనవరి 25: ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ..ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలకుగాను పన్నులు చెల్లించిన తర్వాత రూ.1,437 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో రూ.6.14 కోట్ల లాభాన్ని మాత్రమే ఆర్జించింది. సమీక్షకాలంలో నూతన బిజినెస్ ప్రీమియం వసూళ్ళలో 554 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. మొత్తంగా ఆరు నెలల్లో నికర ప్రీమియం వసూళ్ళు రూ.1,679 కోట్లు పెరిగి రూ.1.86 లక్షల కోట్లకు చేరుకున్నాయి.