ట్రిపోలీ: లిబియాలో అంతర్గత పోరు కొనసాగుతున్నది. గత కొన్ని నెలలుగా రాజకీయ అనిశ్చితిలో కొనసాగుతున్న లిబియాలో ప్రభుత్వ, తిరుగుబాటు ప్రభుత్వ వర్గాల సాయుధుల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. అయితే లిబియా రాజధాని ట్రిపోలీలో శనివారం గత రెండేండ్లలో ఎన్నడూ లేనంత తీవ్రస్థాయిలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
ఈ ఘర్షణల్లో శనివారం 23 మంది ప్రాణాలు కోల్పోగా.. 87 మందికి గాయాలయ్యాయి. అయితే ఘర్షణలు ఇంకా కొనసాగుతుండటంతో ఆదివారం నాటికి మృతుల సంఖ్య 32కు చేరింది. 159 మంది క్షతగాత్రులయ్యారు. దాంతో ప్రస్తుతం ట్రిపోలీలో పరిస్థితులు టెన్షన్ టెన్షన్గా మారాయి. ఈ ఘర్షణలు ఎక్కడ అంతర్యుద్ధానికి దారితీస్తాయోనని జనం ఆందోళన చెందుతున్నారు.
కాగా, తాజా ఘర్షణల్లో మరణించిన వారిలో ముస్తఫా బరాకా అనే సోషల్ మీడియా కమెడియన్ కూడా ఉన్నారు. ఇతను తిరుగుబాటు బలగాలకు, అవినీతి వ్యతిరేకంగా కామెడీ వీడియోలు చేయడంతో కాల్చి చంపారు.