లండన్: మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో పోస్టు చేసిన ఓ లేఖ తాజాగా అడ్రస్కు చేరింది. 1916లో ఈ లేఖను క్రిస్టాబెల్ మెన్నెల్ అనే యువతి, స్టాంప్ డీలర్ ఓ స్వాల్డ్ మార్ష్ను వివాహం చేసుకొన్న తన దోస్తు కేటీ మార్ట్కు పోస్టు చేశారు.
బాత్లో తాను విహారయాత్రలో ఉన్నప్పుడు ఆమె లేఖ రాశారు. వందేండ్ల తర్వాత 2021లో ఈ లేఖ దక్షిణ లండన్లోని హామ్లెట్ రోడ్డులోని ఓ ప్లాట్ వద్ద లెటర్ బాక్స్లో కనిపించింది. ఈ లెటర్ అందుకోవాల్సిన వ్యక్తి చనిపోయారు. అడ్రస్ ప్లాట్లో ఉండే గ్లెన్(27) ఈ లేఖను చూసి ఆశ్చర్యపోయారు. హిస్టారికల్ సొసైటీకి ఆ లేఖను అందించారు.