న్యూఢిల్లీ, అక్టోబర్ 31: కొవిడ్ వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతున్న 6 రాష్ర్టాల్లోని 40 జిల్లాల కలెక్టర్లతో ప్రధాని మోదీ ఈ నెల 3న (బుధవారం) సమీక్ష నిర్వహించనున్నారు. వర్చువల్గా జరిగే సమావేశంలో ఆయా రాష్ర్టాల సీఎంలు కూడా పాల్గొననున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ‘కరోనా టీకా మొదటి డోసును కనీసం 50% మందికి కూడా వేయని జిల్లాల కలెక్టర్లతో ప్రధాని మోదీ ఈ నెల 3న సమావేశం కానున్నార’ని పేర్కొన్నది. ఈ జిల్లాలు జార్ఖండ్, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయలో ఉన్నాయి.