హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): న్యాయ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ లాసెట్, పీజీ లాసెట్ అడ్మిషన్ల షెడ్యూల్ బుధవా రం విడుదలైంది. నోటిఫికేషన్ ఈ నెల 26న విడుదలకానుండగా, ఈ నెల 27 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభంకానున్నాయి. ఈ ఏడాది 54 కాలేజీల్లో 7,069 సీట్లు ఉన్నాయి. వీటిలో కన్వీనర్ కోటా సీట్లకు అదనంగా మరో పది శాతం సీట్లను సూపర్న్యూమరీ కోటాలో పెంచారు. విద్యార్థులకు డిసెంబర్ 27 నుంచి తరగతులను ప్రారంభించనున్నారు.