చెన్నైలో ప్రారంభించిన జితేంద్ర సింగ్
చెన్నై, అక్టోబర్ 29: భారతదేశ మొట్టమొదటి మానవ సహిత సముద్రజలాంతర యాత్ర కోసం ఉద్దేశించిన ‘సముద్రయాన్’ మిషన్ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ శుక్రవారం చెన్నైలో ప్రారంభించారు. సముద్రంలోని మాంగనీస్, గ్యాస్ హైడ్రేట్స్, కోబాల్ట్ క్రస్ట్, హైడ్రో థర్మల్ సల్ఫైడ్ల వంటి సహజ వనరుల వెలికితీతకు, జీవ వైవిధ్యాన్ని అంచనా వేయడానికి ఈ మిషన్ ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. ఈ మిషన్ ప్రారంభం ద్వారా భారతదేశం అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనా దేశాల సరసన నిలిచిందన్నారు. సముద్రయాన్ కోసం తయారు చేస్తున్న ప్రత్యేక వాహనం మత్య్య6000 ప్రాథమిక నమూనా తయారైందని ఈ సందర్భంగా చెప్పారు. 2022లో ఇది అందుబాటులోకి వస్తుందని, దీనిలో 2024లో ట్రయల్స్ ప్రారంభం అవుతాయని తెలిపారు.