సుల్తాన్బజార్, నవంబర్ 25 : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హైదరాబాద్ సిటీ శాఖ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యులుగా పోటీ చేసిన తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం, డీహెచ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లాలూప్రసాద్ రాథోడ్ గెలుపొందారు. ఈ ఎన్నికల్లో డాక్టర్ లాలూప్రసాద్ రాథోడ్కు 518, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం లీగల్ అధ్యక్షుడు డాక్టర్ పల్లం ప్రవీణ్కు 481, డాక్టర్ వినోద్ కుమార్కు 460, డాక్టర్ లింగం గౌడ్కు 471, డాక్టర్ శాలిని తుమ్మకు 444, డాక్టర్ రమేశ్ (సిద్దిపేట)కు 428, డాక్టర్ విజయ్ కుమార్కు 425, డాక్టర్ ఉమాకాంత్ గౌడ్కు 427, డాక్టర్ రంగా అజ్మీరాకు 417, డాక్టర్ రఘు రచ్చకు 405, డాక్టర్ వెంకట మణికి 391, డాక్టర్ సాయిరాంకు 364, డాక్టర్ దీన్ దయాల్ 352 ఓట్లతో సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు ఐఎంఏ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.