లక్నో : లఖింపూర్ ఖేరి హింస ఘటనలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాను వీలైనంత త్వరగా అరెస్టు చేస్తామని ఉత్తర్ప్రదేశ్ ఐజీ లక్ష్మీసింగ్ పేర్కొన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని, ఆశిష్ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. లఖింపూర్ ఖేరి ఘటన ఎఫ్ఐఆర్లో హత్యాయత్నం కేసు నమోదు చేయగా.. ఆశిష్ను అరెస్టు చేయడానికి పోలీసు బృందాలు వెతుకుతున్నాయన్నారు. ఈ సందర్భంగా మంత్రి కుమారుడికి సమన్లు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. ఈ కేసుపై సుప్రీం కోర్టు గురువారం విచారణ జరిపింది. ఎఫ్ఐఆర్లో ఎవరెవరు ఉన్నారు? ఎవరిని అరెస్టు చేశారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.