BAN vs IND : బంగ్లాదేశ్, భారత్ జట్ల మధ్య చత్తోగ్రామ్లో జరుగుతున్న మొదటి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రెండో రోజో ఆట ప్రారంభమైన కాసేపటికే శ్రేయాస్ అయ్యర్(86)ను హొస్సేన్ బౌల్డ్ చేశాడు. అయితే టెయిలెండర్లు రాణించడంతో భారత్ 404 పరుగులు చేసింది. భారత్ను తక్కువకే కట్టడి చేసిన ఆనందం బంగ్లాకు మిగలలేదు. పేసర్ సిరాజ్ తొలి బంతికే ఓపెనర్ శాంటోను ఔట్ చేశాడు. అంతేకాదు కీలకమైన లిట్టన్ దాస్(24) వికెట్ సాధించాడు. మరోవైపు ఉమేశ్ యాదవ్ కూడా విజృభించడంతో బంగ్లాదేశ్ 56 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత చైనామన్ కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ చేశడు. షకిబుల్ హసన్ (3) వికెట్ తీశాడు. 32వ ఓవర్లో ముష్ఫికర్ రహీం (28)తో పాటు తైజుల్ ఇస్లాంను పెవిలియన్కు పంపాడు. అతను ఆరు ఓవర్లలో 4 వికెట్లు తీసి బంగ్లాను దెబ్బ కొట్టాడు. ఆటముగిసే సరికి మొహిదీ హసన్ మిరాజ్, ఎడబాట్ హొస్సేన్ క్రీజులో ఉన్నారు. 271 పరుగులు వెనకబడి ఉంది. పేసర్ సిరాజ్, కుల్దీప్ తలా నాలుగు వికెట్లు పడగొట్టారు. ఉమేశ్ యాదవ్ ఒక వికెట్ తీశాడు.
రెండో రోజు తొలి సెషన్లోనే టీమిండియా ఆలౌట్ అయింది. శ్రేయాస్ అయ్యర్ (86 రన్స్) ఒక్క పరుగు కూడా చేయకుండానే ఔట్ అయ్యాడు. అయితే అశ్విన్, కుల్దీప్ (40) బంగ్లా బౌలర్లకు పరీక్ష పెట్టారు. వీళ్లిద్దరు మంచి భాగస్వామ్యం నిర్మించారు. అశ్విన్ 13 టెస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్లో కుల్దీప్ టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించాడు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం, మెహిదీ హసన్ మిరాజ్ చెరో నాలుగు వికెట్లు తీశారు. ఖలెద్ అహ్మద్, ఎడబాట్కు ఒక్కో వికెట్ దక్కింది.