ధారూరు : ధారూరు మండల పరిధిలోని కోట్పల్లి ప్రాజెక్టులో పర్యాటకులు ఆదివారం సందడి చేశారు. నూతన సంవత్సరం శని, ఆదివారాలు కలిసి రావడంతో పర్యటకులు ప్రాజెక్టుకు భారీగా తరలి వచ్చారు. ప్రాజెక్టు నీటిలో ఫొటోలు సెల్పీలు తీసుకున్నారు. అనంతరం ప్రాజెక్టులో ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులో ప్రతి వారం పర్యటకుల సంఖ్య పెరుగుతుండడంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
కోట్పల్లి ప్రాజెక్టులో ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధుల సందడి..
కోట్పల్లి ప్రాజెక్టులో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కుటుంబ సభ్యులు, వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేశ్, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, వికారాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు కమాల్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శంషాద్భేగంముత్తహర్ షరీఫ్, మహిళా కౌన్సిలర్లు ఒక్క రోజు విహారయాత్రగా కోట్పల్లి ప్రాజెక్టుకు చేరుకున్నారు. కోట్పల్లిలో బోటింగ్ చేస్తూ, నీటిలో సరదాగ ఆడారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రగా రావడంతో కోట్పల్లి ప్రాజెక్టు సందడిగా మారింది.