Khaidi-2 Shooting Update | టాలీవుడ్ హీరోలకు సమానంగా తెలుగులో క్రేజ్ తెచ్చుకున్న నటుడు కార్తి. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి. ఈయన సినిమాలకు టాలీవుడ్ టైర్2 హీరోల సినిమాలకున్నంత క్రేజ్ ఉంది. అంతేకాకుండా కార్తి ఇక్కడ ఇంటర్వూలు గాని, స్పిచ్లలో గాని తెలుగులో మాట్లాడటంతో టాలీవుడ్ ప్రేక్షకులలో మరింత అభిమానం సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో ఐదు సినిమాలన్నాయి. అందులో ‘విరుమన్’ ఒకటి. ముత్తయ్య దర్శకత్వం వహించాడు. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్లను షురూ చేశారు.
ప్రమోషన్లో భాగంగా కార్తి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఈ క్రమంలోనే ఖైదీ సీక్వెల్పై క్లారిటీ ఇచ్చాడు. లోకేష్ ప్రస్తుతం విజయ్67తో బిజీగా ఉన్నాడని, అది పూర్తవ్వగానే ఖైదీ సెట్స్పైకి వెళ్తుందని కన్ఫార్మ్ చేశాడు. 2019లో వచ్చిన ‘ఖైదీ’ ఎంతపెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. తెలుగులో కూడా ఈ చిత్రం డిస్ట్రీబ్యూటర్లకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఈ చిత్ర సీక్వెల్ గురించి ప్రేక్షకులు ఎంత ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
ఇక కార్తి ‘విరుమన్’పై పూర్తి నమ్మకంతో ఉన్నట్లు తెలిపాడు. ఈ చిత్రంలో కార్తికి జోడీగా దిగ్గజ దర్శకుడు శంకర్ కూతురు అధితి శంకర్ హీరోయిన్గా నటించింది. 2డీ ఎంటర్టైనమెంట్స్ పతాకంపై సూర్య ఈ చిత్రాన్ని నిర్మించాడు.