దేవరకద్ర రూరల్: పాలమూరు జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు, దేవరకద్ర మండలంలోని మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు కోయిల్ సాగర్కు మంగళవారం ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టుకు 2వేల క్యూసెక్కుల నీరు చేరుతుం డటంతో 3గేట్ల ద్వారా 2500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఈఈ ప్రతాప్సింగ్ తెలిపారు.
ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో వారంరోజులుగా కురుస్తున్నవర్షాలకు నీటి వరద ప్రాజెక్టుకు వచ్చిచేరుతున్నట్లు తెలిపారు. ప్రాజె క్టులో అప్పటికే 32.5 అడుగులు(2.25టీఎంసీలు)నీరు ఉన్నసందర్బంగా, వరద ప్రభావాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నీటిని వదులుతున్నామని వెల్లడించారు.ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 32.6అడుగులు(2.27 టీఎంసీలు) అని తెలిపారు.