కొడంగల్ : కొడంగల్ నియోజకవ్గంలోని కొడంగల్, కోస్గి మున్సిపాలిటీల అభివృద్ధిని మరిన్ని నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మంత్రి కేటీఆర్ను కోరారు. శనివారం హైదరాబాద్లోని ప్రగతిభవన్లో ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డితో పాటు నాయకులు మంత్రి కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలకు అప్పట్లో చరో రూ. 15కోట్ల నిధులు మంజూరు చేయడంపై ప్రస్తుతం అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయని, మరింత అభివృద్ధికి గాను మరిన్ని నిధులు మంజూరు చేసి మున్సిపాలిటీల అభివృద్ధికి సహకరించాలని మంత్రిని ఎమ్మెల్యే కోరారు.
నియోజకవర్గ పరిధిలోని కొడంగల్ పట్టణంలో అధునాతన, అన్ని హంగులతో కూడిన 50 పడకల ఆసుపత్రి భవన నిర్మాణం త్వరలో పూర్తి కానుందని, దౌల్తాబాద్ మండలంలో మినీ ట్యాంక్బాండ్ వంటి అభివృద్ధి పనులు చాలా వరకు చివరి దశకు చేరుకొని ప్రారంభానికి సిద్ధం అవుతున్నట్లు ఎమ్మెల్యే, మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కొడంగల్, కోస్గి మున్సిపాలిటీలో సీసీ, డ్రైనేజీ పనులు కూడా పూర్తి కాబడుతున్నాయని, అభివృద్ధి దృష్ట్యా రెండు మున్సిపాలిటీలకు చరో రూ. 10కోట్లు మంజూరు చేయాలని కోరారు.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వినతిపై మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించి నిధుల మంజూరుకు చర్యలు తీసుకోనున్నట్లు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ బాల్సింగ్నాయక్, మున్సిపల్ కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్, సర్పంచ్ పకీరప్ప పాల్గొన్నారు.