ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్
దుబాయ్: టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ లోకేశ్ రాహుల్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని నాలుగో ప్లేస్కు చేరాడు. టాప్-10లో భారత్ నుంచి కేఎల్ రాహుల్ (729 పాయింట్లు)తో పాటు విరాట్ కోహ్లీ (10వ స్థానం; 657 పాయింట్లు) మాత్రమే ఉన్నారు. ఐసీసీ బుధవారం విడుదల చేసిన జాబితాలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (805) టాప్లో ఉండగా.. బౌలింగ్ విభాగంలో శ్రీలంక స్పిన్నర్ వణిండు హసరంగా (797 పాయింట్లు) అందరికంటే ముందున్నాడు. బౌలింగ్తో పాటు ఆల్రౌండర్స్ విభాగాల్లో భారత్ నుంచి టాప్-10లో ఒక్కరూ లేకపోగా.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో అత్యుత్తమంగా 20వ ర్యాంక్లో కొనసాగుతున్నాడు.