చెన్నై: కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) బ్యాట్స్మన్ నితీశ్ రాణా ముంబైలో క్వారంటైన్లో ఉండగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్గా తేలింది. తాజాగా నిర్వహించిన కొవిడ్-19 పరీక్షలో అతనికి కరోనా నెగెటివ్గా వచ్చిందని ఆ ఫ్రాంఛైజీ ఒక ప్రకటనలో తెలిపింది. త్వరలోనే జట్టు ట్రైనింగ్ సెషన్లలో పాల్గొంటాడని కేకేఆర్ పేర్కొంది. యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020లో 14 మ్యాచ్లు ఆడిన రాణా 352 పరుగులు సాధించాడు.
మార్చి 19న కొవిడ్ టెస్టు చేయించుకోగా నితీశ్కు నెగెటివ్ వచ్చింది. అదే సర్టిఫికెట్తో మార్చి 21న ముంబైలోని కేకేఆర్ టీమ్ హోటల్లో చేరాడు. ఐపీఎల్ ప్రోటోకాల్ ప్రకారం, అతడు క్వారంటైన్లో ఉండగా, మార్చి 22న మరోసారి టెస్టులు చేయగా పాజిటివ్గా తేలింది. అప్పుడు అతనికి ఎలాంటి లక్షణాలు లేవు. నిబంధనల ప్రకారం మళ్లీ ఐసోలేషన్లోనే ఉంచారు. తాజాగా మరోసారి టెస్టులు చేయగా నెగెటివ్ వచ్చింది.