వాటా విక్రయించనున్న ఫండ్
న్యూఢిల్లీ, మార్చి 23: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్ (కొత్త పేరు..రీ సైస్టెనబిలిటీ) నుంచి వైదొలిగేందుకు ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ కేకేఆర్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ సంస్థలో 2018లో కేకేఆర్ 60 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఐపీవో జారీ ద్వారా కొంత వాటాను విక్రయించాలని గతంలో కేకేఆర్ భావించినప్పటికీ, ఆ ప్రతిపాదనను తాజాగా రద్దు చేసుకుందని, మొత్తం వాటాను ప్రైవేట్గా విక్రయించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ లావాదేవీకి అడ్వయిజర్గా వ్యవహరిస్తున్న అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ జేపీ మోర్గాన్..కేకేఆర్ తరపున వివిధ ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) ఫండ్స్ను సంప్రదిస్తున్నది.