Kinnera Mogilaiah | పద్మ శ్రీ అవార్డు గ్రహీత 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్య పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. రెక్కాడితే కానీ డొక్కాడని ఈ నిరుపేద కళాకారుడిని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పద్మ శ్రీ అవార్డు గ్రహీతలను గొప్పగా చూసుకుంటామని చెప్పిన రేవంత్ మాటలు హామీలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వం నుంచి ఆయనకు అందాల్సిన గౌరవ వేతనం గత ఐదు నెలల నుంచి అందడం లేదు. దీంతో మొగిలయ్య దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు.
గత కేసీఆర్ ప్రభుత్వంలో దర్శనం మొగిలయ్యకు ప్రతి నెల రూ. 10 వేల గౌరవ వేతనం అందజేశారు. ఈ గౌరవ వేతనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆపడంతో మొగిలయ్య కూలి పని చేసుకుంటున్నాడు. మొగిలయ్య కూలీ పని చేసుకుంటున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ప్రతినెలా ఇస్తానన్న రూ. 25 వేల పెన్షన్ దేవుడు ఎరుగు గత ప్రభుత్వంలో కిన్నెర మొగిలయ్యకి ఇచ్చిన రూ. 10 వేల గౌరవ వేతనం బంద్ అయింది.. మోగిలయ్య కూలి పనికి పోవాల్సి వస్తుందని నెటిజన్లు మండిపడుతున్నారు.
పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన వారికి మొదటిసారి రూ. 25 లక్షల నగదు అందజేస్తాం.. వారి ఖర్చుల నిమిత్తం ప్రతి నెలా రూ.25 వేల పెన్షన్ అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ మొగిలయ్య విషయంలో మాత్రం ఆ హామీ నెరవేరడం లేదు.
తనకు మార్చి 31, 2024లో చివరిసారిగా రూ. 10 వేల పెన్షన్ అందజేసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని మొగిలయ్య స్పష్టం చేశారు. గత ఐదు నెలల నుంచి ఎలాంటి పెన్షన్ తన ఖాతాలో జమ కాలేదని, ఇదే విషయాన్ని బ్యాంకు అధికారులు కూడా స్పష్టం చేసినట్లు మొగిలయ్య తెలిపారు. మీకే ఖాతా బుక్ ఇస్తాను.. చెక్ చేయండి అని మొగిలయ్య స్పష్టం చేశారు. ఇదే అంశంపై మొగిలయ్య కుమారుడిని వివరణ కోరగా, అతను కూడా మొగిలయ్య మాదిరే సమాధానం ఇచ్చాడు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి వేడుకున్నాం.. మా బ్యాంక్ అకౌంట్లు కూడా చెక్ చేసుకున్నాం పెన్షన్ పడట్లేదు అని కుమారుడు మహేందర్ అలియాస్ మహేష్ తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో కష్టాలు పడుతున్న దర్శనం మొగిలయ్యను ఆదుకుంటామని, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. మొగిలయ్య కుటుంబానికి వ్యక్తిగతంగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. తన టీం ఆయనను కలుసుకుంటుందని కేటీఆర్ పేర్కొన్నారు.
కిన్నెర మొగులయ్యకు పెన్షన్ ఇస్తున్నాం అంటున్న ప్రభుత్వం..
లేదు నాకు గత ఐదు నెలలుగా పెన్షన్ రావట్లేదు అంటున్న మొగులయ్య.. https://t.co/j1V2qLnoCl pic.twitter.com/Aht0FXllrS
— Telugu Scribe (@TeluguScribe) May 3, 2024
పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ప్రతినెలా ఇస్తానన్న రూ. 25 వేల పెన్షన్ దేవుడు ఎరుగు గత ప్రభుత్వంలో కిన్నెర మోగిలయ్యకి ఇచ్చిన రూ. 10 వేల గౌరవ వేతనం బంద్ అయింది.. మోగిలయ్య కూలి పనికి పోవాల్సి వస్తుంది… https://t.co/NS8T9b1DtM pic.twitter.com/6nH16prjFI
— Telugu Scribe (@TeluguScribe) May 3, 2024