చండ్రుగొండ, నవంబర్ 28: మండలంలోని సత్యనారాయణపురం పోడు సమస్యను పరిష్కరించాలని అటవీ, రెవెన్యూశాఖల అధికారులను ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరరావు ఆదేశించారు. సోమవారం ఎమ్మెల్యే స్వగృహంలో పోడుదారులు కలిసిన సందర్భంగా సమస్యను తెలుసుకున్నారు. గ్రామానికి చెందిన 40 మంది పోడుదారులు తిప్పనపల్లి బీట్, రెవెన్యూ పరిధిలోని అడవిని పోడుసాగు చేసుకుంటున్నారని, వీరు ఏ పంచాయతీ గ్రామ సభలో దరఖా స్తు చేసుకోవాలో తెలియక దరఖాస్తు చేసుకోలేదని తెలిపారు. ఎమ్మె ల్యే ఫోన్లో సమస్యను కలెక్టర్ అనుదీప్, ఫారెస్ట్ అధికారులకు తెలిపారు. గ్రామాన్ని సందర్శించి పోడు సమస్యను పరిష్కరించాలన్నారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటేశ్వరరావు (దారా బాబు), ఉపాధ్యక్షుడు సత్తి నాగేశ్వరరావు, వంకాయలపాటి బాబురావు, పోడుదారులు పాల్గొన్నారు.
ఇరుముడి కార్యక్రమంలో ఎమ్మెల్యే
ములకలపల్లిలోని కొత్తశివాలయంలో జరిగిన అయ్యప్ప భక్తుల ఇరుముడి కార్యక్రమంలో ఎమ్మెల్యే మెచ్చా పాల్గొని, పండితుల నుంచి ఆశీర్వాదం స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో దమ్మపేట జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, సర్పంచ్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శనగపాటి అంజి, నందు, సురభి, రాజేశ్, సర్దార్ పాల్గొన్నారు.
భద్రారెడ్డికి ఎమ్మెల్యే నివాళి
దమ్మపేట, నవంబర్ 28: దమ్మపేట ఎంపీడీవో కార్యాలయంలో పనిచేసిన రిటైర్డ్ సూపరింటెండెంట్ భద్రారెడ్డి అనారోగ్యంతో సోమవారం మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సత్తుపల్లిలోని ఆ యన నివాసానికి వెళ్లి భద్రారెడ్డి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు సంతా పం, సానుభూతి తెలిపారు. నివాళి అర్పించిన వారిలో ఎంపీపీ సోయం ప్రసాద్, జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, ఎంపీడీవో చంద్రశేఖర్, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, ఉపసర్పంచ్ దారా యుగంధర్, కార్యాలయ సిబ్బం ది, దమ్మపేట ప్రెస్క్లబ్ బాధ్యులు ఉన్నారు.
లీలావతికి నివాళి
దమ్మపేటకు చెందిన మోరంపూడి వెంకటేశ్వరరావు తల్లి లీలావతి సోమవారం మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆమె నివాసానికెళ్లి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు సంతాపం, సానుభూతి తెలిపారు. ఆయన వెంట జడ్పీటీసీ, మండల కార్యదర్శి ఉన్నారు.