ఖమ్మం నవంబర్ 21 : ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఆయా అభివృద్ధి పనుల్లో నాణ్యత చేపడుతున్నారా? లేదా? అనే విషయాలను తెలుసుకునేందుకు కార్పొరేషన్ కమిషనర్ ఆదర్శ్ సురభి ఉదయాన్నే నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి పనులను పరిశీలించారు.
సోమవారం ఉదయం నగరంలోని 26, 28, 23, 24 డివిజన్లలో నిర్మించిన రోడ్లు, డ్రైన్లను పరిశీలించారు. ఆయా పనుల గురించి ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాటర్ లెవల్స్, ఫ్లోరింగ్ తదితర వివరాలను అడిగారు. కమిషనర్తోపాటు మున్సిపల్ ఈఈ కృష్ణలాల్, డీఈ స్వరూపరాణి, ఏఈ నవ్యజ్యోతి తదితరులు పాల్గొన్నారు.