ఆర్మూర్: ఆర్మూర్ మండలం మామిడిపల్లిలో రెండు రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఖమ్మం, రంగారెడ్డి విజేతలుగా నిలిచాయి. ఆదివారం జరిగిన బాలికల ఫైనల్లో ఖమ్మం..నిజామాబాద్పై విజయం సాధించగా, వరంగల్ మూడో స్థానంలో నిలిచింది. బాలుర తుది పోరులో కరీంనగర్పై రంగారెడ్డి గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఆదిలాబాద్కు మూడో స్థానం దక్కింది. ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ సంఘం చైర్మన్ శ్రీనివాసరావు అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. క్రీడల వల్ల క్రమశిక్షణ అలవడుతుందని ఆయన పేర్కొన్నారు.