న్యూఢిల్లీ: కశ్మీర్ వేర్పాటువాదులకు మద్దతుగా హ్యూండాయ్ చేసిన ట్వీట్ వివాదం మరవక ముందే కేఎఫ్సీ కూడా అదే తరహా పోస్ట్తో వివాదంలో ఇరుక్కున్నది. కశ్మీరీలకే కశ్మీర్ చెందుతుందని, త్వరలో వారికి శాంతి చేకూరుతుందని పేర్కొంటూ కేఎఫ్సీ పాకిస్థాన్ ఫేస్బుక్ ఖాతా నుంచి పోస్ట్ అప్లోడ్ అయింది. దీనిపై దుమారం రేగడంతో కేఎఫ్సీ ఇండియా క్షమాపణలు చెప్పింది. వివాదాస్పద పోస్ట్ విషయంలో హ్యూండాయ్ వివరణ ఇచ్చే యత్నం చేసింది. హ్యూండాయ్ వైఖరిని నిరసిస్తూ ఇప్పటికే చేసుకొన్న ఆర్డర్లను పలువురు క్యాన్సిల్ చేస్తున్నారు.