తిరువనంతపురం : ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్కు కేరళ హైకోర్టు ఊరట ఇచ్చింది. సీబీఐ విచారణను ప్రభావితం చేశారంటూ దాఖలైన పిటిషన్ను కేరళ హైకోర్టును కొట్టి వేసింది. 1994 గూఢచర్యం కేసులో నంబి నారాయణన్ను తప్పుగా ఇరికించిన మాజీ పోలీస్ అధికారి దాఖలు చేసిన ఈ పిటిషన్ కోర్టు పిటిషన్ను కొట్టి వేసింది. నంబి నారాయణన్ అప్పటి దర్యాప్తు అధికారులతో కోట్ల విలువైన భూ ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా సీబీఐ విచారణను ప్రభావితం చేశారని కేరళ మాజీ పోలీసు అధికారి ఎస్ విజయన్ ఆరోపించగా.. జస్టిస్ ఆర్ నారాయణ, జస్టిస్ పిషారడి విజయన్ పిటిషన్ను తోసిపుచ్చారు.
1994 గూఢచర్యం కేసులో నారాయణన్, మరికొందరిని తప్పుగా ఇరికించారనే ఆరోపణలపై 17 మంది ఇతర మాజీ కేరళ పోలీసులు, ఐబీ అధికారులతో పాటు విజయన్ సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో నంబి నారాయణన్, ఆయన కుమారుడిని పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్లుగా చూపే భూమికి సంబంధించిన ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లను తాను ట్రయల్ కోర్టు ముందు ఉంచానని విజయన్ హైకోర్టు ఎదుట వాదించారు.
ఈ భూములను సీబీఐ అధికారులకు విక్రయించారని, శాస్త్రవేత్త, ఏజెన్సీ అధికారులపై అవినీతి నిరోధక చట్టం కింద విచారణకు ఆదేశించేందుకు ట్రయల్ కోర్టుకు ఈ మెటీరియల్ సరిపోతుందని విజయన్ ఆరోపించారు. అయితే, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు భూమి అమ్మకాన్ని రుజువు చేయడం లేదని పేర్కొన్న హైకోర్టు, అసలు సేల్ డీడ్లను చూపాలని విజయన్ను ఆదేశించింది. ట్రయల్ కోర్టు విచారణకు ఆదేశించాలంటే ప్రాసిక్యూట్కు అనుమతి కూడా అవసరమని హైకోర్టు పేర్కొంది.