తిరువనంతపురం: కేరళలో కరోనా మహమ్మారి ( Corona in Kerala ) ప్రభావం ఇప్పటికీ ఎక్కువగానే ఉన్నది. ఇవాళ కూడా కొత్తగా 12,297 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 47,20,233కు చేరింది. ఇక ఇవాళ కొత్తగా 74 మంది కరోనా బాధితులు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 25,377కు పెరిగింది. అదేవిధంగా మహమ్మారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గత కొన్ని రోజులుగా ఎక్కువగానే ఉంటున్నది. ఇవాళ కూడా 16,333 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు.
దాంతో ఆ రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 45,57,199కి చేరింది. కరోనా మరణాలు, రికవరీలు పోను ప్రస్తుతం కేరళలో 1,37,043 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా 14 జిల్లాల్లో కరోనా ఉధృతి బాగా ఉండగా.. అందులో ఎర్నాకుళం, త్రిస్సూర్, తిరువనంతపురం, కోజికోడ్ జిల్లాలు తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.