అమృత్సర్, నవంబర్ 22: వచ్చే ఏడాది జరుగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో 18 ఏండ్లు దాటిన మహిళందరికీ ప్రతి నెలా రూ.వెయ్యి చొప్పున అందజేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. కుటుంబంలో ఎంత మంది మహిళలు ఉన్నా అందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా సాధికారత కార్యక్రమం అని పేర్కొన్నారు.
ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం మోగా నగరంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ను ‘ఫేక్ కేజ్రీవాల్’గా పేర్కొంటూ.. ఆయన తన ఎన్నికల హామీలను కాపీ కొడుతున్నారని ఆరోపించారు.