విద్యానగర్/చొప్పదండి ఏప్రిల్ 25: కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు జాతీయ స్థాయిలో బెస్ట్పర్ఫార్మెన్స్ అవార్డుకు ఎంపిక కాగా సోమవారం ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో జరిగిన కార్యక్రమంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు ఆ అవార్డును అందుకొన్నారు. ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ భాఘేల్ చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. దేశంలోని 362 కేంద్ర సహకార కేంద్ర బ్యాంకుల్లో వరుసగా ఐదోసారి కరీంనగర్కు అవార్డు దక్కడం విశేషం. జాతీయస్థాయిలో మూడో స్థానం దక్కించుకొన్న చొప్పదండి సహకార సంఘం తరఫున చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, కార్యదర్శి కళ్లెం తిరుపతిరెడ్డి అవార్డు అందుకొన్నారు.